సాయితేజ మృతదేహం గుర్తింపు

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుల మృతదేహాలను గుర్తించారు. ఆరుగురు మృతదేహాలను ఆనవాళ్లను బట్టి గుర్తించారు

Update: 2021-12-11 04:14 GMT

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సైనికుల మృతదేహాలను గుర్తించారు. మరో ఆరుగురు మృతదేహాలను ఆనవాళ్లను బట్టి గుర్తించారు. ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. నిన్ననే బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అంత్యక్రియలు జరిగాయి.

ఈరోజు స్వగ్రామానికి...
ఏపీకి చెందిన సాయితేజ మృతదేహాన్ని గుర్తించామని ఆర్మీ అధికారులు తెలిపారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక విమానంలో సాయితేజ మృతదేహాన్ని ఈరోజు ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందజేశారు.


Tags:    

Similar News