టీడీపీతో పొత్తుపై సోము క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి పొత్తు జనసేనతో మాత్రమే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు

Update: 2022-09-24 08:19 GMT

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి పొత్తు జనసేనతో మాత్రమే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన ఈరోజు నెల్లూరు మీడియాతో మాట్లాడారు. పొత్తు జనంతో ఉంటుందన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనే మాట లేకుండా పోయిందన్నారు. నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కేంద్రం ముందుకొచ్చినా....
సముద్ర తీరం వెంట ఐదు లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. పోర్టులు కాదు కదా? కనీసం ఒక బెర్త్ కూడా కట్టే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆయన అననారు. కేంద్ర ప్రభుత్వం పది లక్షల ఇళ్లు కేటాయిస్తే దానిని నిర్మించే పరిస్థిితి కూడా రాష్ట్రంలో లేదన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఇస్తే ఆ నిధులను ప్రభుత్వం మళ్లించి ఇతర అవసరాలకు వాడుకుందని సోము వీర్రాజు మండి పడ్డారు.


Tags:    

Similar News