జగన్ కు సోము వీర్రాజు ఘాటు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు

Update: 2022-03-16 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమయిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో మూడు లక్షలకు పైగా ఖాళీలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని సోము వీర్రాజు గుర్తు చేశారు.

ఖాళీగా ఉన్న....
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయని కారణంగా తాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్ల పారదర్శకత లోపిస్తుందని చెప్పారు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ యువత నిరాశలో కొట్టుమిట్టాడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ వయసు దాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సోము వీర్రాజు సీఎంకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు.


Tags:    

Similar News