BJP : సత్తిబాబూ.. అవినీతిచేసే వాళ్లకు అంతా అలాగే కనపడుతుంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి మంత్రి బొత్స సత్యనారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-05-09 05:28 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి మంత్రి బొత్స సత్యనారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి చేసే వారందరికీ అందరూ అవినీతిచేస్తారనే అనిపిస్తుందన్నారు. విశాఖ రైల్వే జోన్ కు కేటయించిన స్థలం ఎందుకు పనికిరానిదని పురంద్రీశ్వరి అన్నారు. ఆ స్థలం అనువుగా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కు వంద కోట్ల రూపాయలను కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సహకరించకపోవడం వల్లనే విశాఖ రైల్వే జోన్ ఆలస్యమయిందన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.

వోక్స్ వ్యాగన్ గురించి...
వోక్స్ వ్యాగన్ గురించి ఇంకా ఏపీ ప్రజలు మర్చిపోలేదన్న పురంద్రీశ్వరి పచ్చ కామెర్ల వ్యాధి వారికి లోకమంతాపచ్చగానే ఉన్నట్లు కనిపిస్తుందని అన్నారు. అలాగే అవినీతికి పాల్పడే వారంతా మిగిలిన వాళ్లు అవినీతికి పాల్పడతారని అనుకుంటారని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని ఐదేళ్ల కాలంలో అవినీతి మయంచేసిన చరిత్ర వైసీపీది అని పురంద్రీశ్వరి ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలను ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారని పురంద్రీశ్వరి ప్రశ్నించారు. పసలేని ఆరోపణలు చేయవద్దంటూ ఆమె మండిపడ్డారు.


Tags:    

Similar News