ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

Update: 2024-05-04 07:37 GMT

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ జోస్యం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కావడం ఖాయమని అన్నారు. ఏపీలోనూ కూటమి విజయం తధ్యమని అన్నారు.

రిజర్వేషన్లపై...
రిజర్వేషన్లు రద్దు చేేస్తారంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, ప్రజల్లో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తుందని, ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని లక్ష్మణ్ కోరారు. బీసీలను జగన్ బానిసలుగా చేశారన్నారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. బీజేపీ పై చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దంటూ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News