Balineni Srinivas reddy:ఆ విషయాలు సీఎంకి చెప్పకపోతే ఇబ్బందులే

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-02-28 11:14 GMT

Balineni Srinivas reddy:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్‌కు అన్నీ చెబుతానని.. జరిగేవన్నీ ఆయనకు తెలియాల్సిందేనన్నారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలని అడిగితే బాలినేని అలిగాడు అంటారని, ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు కోసమే తాను సీఎంను అడిగానన్నారు. మాగుంట కోసం చాలా పట్టుబట్టాను, సాధ్యం కాలేదు. సర్దుకు పోయానని అన్నారు. చిత్తశుద్ది ఉందని.. ఆ మేరకే రాజకీయాలు చేస్తానని మాజీ మంత్రి బాలినేని అన్నారు. రాజకీయాల్లో చిన్న తప్పు చేసినా సరిదిద్దుకోవటానికి ఏళ్లు పడుతుందని వైఎస్సార్ చెప్పిన మాటలు తనకు గుర్తున్నాయన్నారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకూడదని.. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని ఆయన చెప్పిన మాటలే స్పూర్తి అని అన్నారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని పోరాడానన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజు మాగుంట పార్టీకి రాజీనామా చేశారు. నేను సర్దుకుపోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలా అని ప్రశ్నించారు. ఉన్న పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం నాది కాదన్నారు. చివరిసారిగా పోటీ చేస్తున్నాను.. అందరి అశీస్సులు కావాలన్నారు బాలినేని.


Tags:    

Similar News