ఏపీ కరోనా అప్ డేట్

తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,516 శాంపిళ్లను

Update: 2022-03-06 12:26 GMT

అమరావతి : ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వరుసగా మూడవరోజు వందకు దిగువన రోజువారి కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,516 శాంపిళ్లను పరీక్షించగా.. 79 మందికి కరోనా నిర్థారణ అయింది. ఇదే సమయంలో 167 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణం నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1063 కరోనా కేసులుండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,18,417 కరోనా కేసులు నమోదవ్వగా.. 23,02,625 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,729గా ఉంది.


Tags:    

Similar News