నిధుల్లేవు.. పథకాన్ని అందుకే నిలిపేశాం

దుల్హన్ పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఏపీ సర్కార్ హైకోర్టుకు వెల్లడించింది.

Update: 2022-06-23 06:57 GMT

దుల్హన్ పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఏపీ సర్కార్ హైకోర్టుకు వెల్లడించింది. దుల్హన్ పథకం అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ పథకం అమలుపై హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది.

పేద ముస్లిం యువతులకు...
దుల్హన్ పథకాన్ని నిధుల లేమి కారణంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. పేద ముస్లిం యువతులకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేస్తుంది. వివాహం చేసుకునే సమయంలో ప్రతి పేద ముస్లిం యువతికి యాభై వేల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అయితే ఈ పథకాన్ని నిలిపేశామని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.


Tags:    

Similar News