తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు : సీఎం జగన్

నేటితో ముగిసి, రేపటి నుంచి శోభకృతు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ..

Update: 2023-03-21 14:12 GMT

తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృతు నామ సంవత్సరం నేటితో ముగిసి, రేపటి నుంచి శోభకృతు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రప్రజలందరికీ శుభం జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురిసి, రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో, నవ్వులతో కళకళలాడాలని, మన సంస్కృతి వెల్లివిరియాలని సీఎం పేర్కొన్నారు.





Tags:    

Similar News