రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం

ఏపీ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

Update: 2021-11-18 12:51 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వెలగపూడిలోని సచివాలయం 1 బ్లాక్ లోని మీటింగ్ హాలులో మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

కీలక బిల్లులను...
ఈనెల 17వ తేదీన మంత్రి మండలి సమావేశం జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. కొన్ని కీలక బిల్లులను ఆమోదించి ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. రేపు శాసనసభ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వర్గం సమావేశం కానుంది.


Tags:    

Similar News