ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు..

ఇటీవలే కువైట్ నుంచి జిల్లాకు వచ్చిన మహిళకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు.

Update: 2021-12-24 05:27 GMT

ఏపీలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా తూ.గో జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఆ జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవలే కువైట్ నుంచి జిల్లాకు వచ్చిన మహిళకు వైరస్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు. జిల్లాలోని అయినవిల్లి మండలం పెదపాలెంలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదవ్వగా.. రెండవ కేసు తిరుపతిలో నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మూడవ కేసు తూ.గో జిల్లాలో నమోదైంది. ఈ మూడు కేసులు విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారిలోనే వెలుగుచూశాయి.



Tags:    

Similar News