ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Update: 2022-06-22 07:51 GMT

ఏపీలో 2022 సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్‌ ఫ‌లితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌ లో నిలిచింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుద‌ల‌ చేశారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం జూన్‌ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మే 6 నుంచి జూన్ 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,69,059 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఓకేషనల్‌లో 79 వేల 22 మంది పరీక్ష రాశారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్‌ కాగా.. 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణతలో ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్‌లో నిలువగా, చివర్లో ఉమ్మడి కడప జిల్లా నిలిచింది.

ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.


Tags:    

Similar News