భద్రాద్రి రాముడికి మంత్రి కొడాలి నాని బంగారు కానుక

భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతా రామచంద్ర స్వాముల వారిని ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు

Update: 2021-12-07 06:37 GMT

తెలంగాణలోని భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతా రామచంద్ర స్వాముల వారిని ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కోసం రూ.13 లక్షల వ్యయంతో చేయించిన స్వర్ణ కిరీటాన్ని మంత్రి కొడాలి నాని దంపతులు ఆలయ కార్యనిర్వహణాధికారి శివాజీకి అందజేశారు.

స్వర్ణ కిరీటాన్ని....
అనంతరం ఆలయ పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేసి, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ కు అవసరమైన శక్తిని ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News