Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. పేరున్న కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించింది

Update: 2025-09-11 04:01 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. పేరున్న కంపెనీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం పలు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన పారిశ్రామిక విధానాల నేపథ్యంలో, సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుకు అంతా సిద్ధమయింది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది. నాయుడుపేటలోని మేనకూరు గ్రామంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కోరడంతోదీనిని అక్కడ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్లాంట్‌ ద్వారా రాష్ట్రానికి ఆధునిక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో మరో గుర్తింపు లభించనుందని పరిశ్రమ వర్గాలు వెల్లడంచాయి.

ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ...
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ ప్లాంట్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ మరియు సప్లై పాలసీ కింద ఏర్పడే తొలి పరిశ్రమ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సిర్మా కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం.1,076 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్లాంట్‌లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ కోసం రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. దీని ద్వారా సుమారుగా వెయ్యి మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమల పాలసీని అనుమసరించి ఎస్ఎస్ఎల్సీ కి ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు లభిస్తాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐఐసీ 12.56 ఎకరాల భూమిని 75 శాతం రాయితీతో సిర్మా కంపెనీకి కేటాయించనుంది.
మరో రెండు ప్రాజెక్టులకు...
ఈ ప్లాంట్‌లో సింగిల్, మల్టీ లేయర్, హెచ్‌డీఐ, ఫ్లెక్సిబుల్ పీసీబీలు తయారు చేయనున్నారు. వీటిని కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, టెలికాం, రీన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో వినియోగిస్తారు. పరిశ్రమ ప్రారంభమైన తర్వాత భారత్ పీసీబీ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకపోవడం వంటి పెద్ద ప్రయోజనం లభిస్తుంది.ఇంకా సిర్మా గ్రూప్ రెండు అదనపు ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 417.78 కోట్లతో కాపర్ క్లాడ్ ల్యామినేట్ ప్లాంట్ ద్వారా 647 మందికి ఉద్యోగావకాశాలు, మరో వంద కోట్లతో ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఫెసిలిటీ ద్వారా 510 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తం మూడు ప్రాజెక్టుల ద్వారా 1,593 కోట్ల పెట్టుబడి మరియు సుమారుగా 2100 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News