ఏపీలో ఐదువేలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,528 కొత్త కేసులు నమోదయ్యాయి

Update: 2022-01-14 11:57 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు ఈరోజు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 4,528 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 20,93,860 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,508 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 20,61,039 గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 18,313 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,17,96,337 నమూనాలను పరీక్షించారు


Tags:    

Similar News