ఏపీలో కరోనా కేసులు తగ్గాయి.. మరణాలు పెరిగాయ్

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 5,983 కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2022-02-02 12:28 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. ఈరోజు కొత్తగా ఏపీలో 5,983 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా కారణంగా పదకొండు మరణించారు. మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 22,88,566 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో 14,631 మంది మరణించారు.

కృష్ణా జిల్లాలో....
కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,73,313 గా ఉంది. 1,00,622 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,25,40,787 నమూనాలను పరీక్షించారు.ఈరోజు కూడా అత్యధికంగా గుంటూరు జిల్లాలో 738 కరోనా కేసులు నమోదయ్యాయి


Tags:    

Similar News