నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2021-12-21 01:42 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, పేదల కు సొంత ఇంటికల నిజం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగన్ ప్రారంభించనున్నారు.

బహిరంగ సభలో...
అనంతరం బహిరంగ సభలో కూడా జగన్ ప్రసంగిస్తారు. ఈ సభలో కొందరు లబ్దిదారులకు జగన్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేయనున్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రారంభించిన వెంటనే మంచి స్పందన లభించిందని అధికారులు చెబుతున్నారు. స్వచ్ఛందంగానే ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకోవచ్చని, బలవంతం ఏమీ లేదని ప్రభుత్వం చెబుతుంది.


Tags:    

Similar News