నేడు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం బయలుదేరి వెళ్లి రేపు కూడా అక్కడే ఉండనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం బయలుదేరి వెళ్లి రేపు కూడా అక్కడే ఉండనున్నారు. జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్లి రాత్రికి జనపథ్ 1 నివాసంలో బస చేస్తారు.
సమ్మిట్ కర్టెన్రైజర్...
రేపు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. సమ్మిట్ కర్టెన్రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకూ జరిగే సమావేశంలో పాల్గొని తిరిగి తాడేపల్లి బయలుదేరి రానున్నారు. ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు.