అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం .. ఆందోళనకు దిగిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు

Update: 2022-09-15 04:04 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత చూద్దామని స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే చెప్పినా టీడీపీ వినలేదు. జగన్ జాబెక్కడ అంటూ సభలో నినాదాలు చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన సీఎం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని వచ్చారు.

జగన్ జాబ్ ఎక్కడంటూ?
ప్లకార్డులు పట్టుకుని రావద్దని స్పీకర్ టీడీపీ నేతలను హెచ్చరించారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తుండటంతో ప్రశ్నోత్తరాలు కొంత సేపు నిలిపేశారు. తాము అఅధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగం ఉంది తప్పించి, సాధారణ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయంలో సభకు ఆటంకం కల్గించడమేంటని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రశ్నోత్తరాలను తొలగిస్తే ఎందుకు తొలగించారని ప్రశ్నించిన టీడీపీ సభ్యులు ఇప్పుడు వాటిని అడ్డుకోవడమేంటని నిలదీశారు.


Tags:    

Similar News