టెన్త్ పేపర్ లీక్ - 12 మంది అరెస్ట్

తెలుగు ప్రశ్నాపత్రం లీకైందని తెలిసిన వెంటనే డీఈఓ, పోలీస్ అధికారులు విచారణ చేశారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన ..

Update: 2022-04-28 11:16 GMT

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్లో నిన్న టెన్త్ తెలుగు పరీక్ష పేపర్ లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. పేపర్ లీకవడానికి సూత్రధారి అయిన రాజేష్ తో పాటు మరో 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల డ్యూటీకి హాజరై మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి రాజేశ్ గా గుర్తించామన్నారు.

తెలుగు ప్రశ్నాపత్రం లీకైందని తెలిసిన వెంటనే డీఈఓ, పోలీస్ అధికారులు విచారణ చేశారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్ తో పరీక్షపత్రాన్ని ఫొటోలు తీసి, బయట వేచి ఉన్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడని జిల్లా కలెక్టర్ చెప్పారు. అరెస్టైన వారిలో టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్ట, రంగనాయకులు ఉన్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన నలుగురిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు అరెస్ట్ చేసిన వారిని గురువారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు.


Tags:    

Similar News