సాయిరెడ్డి ట్వీట్ చూశారా?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తకరమైన ట్వీట్ చేశారు
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తకరమైన ట్వీట్ చేశారు. త్వరలోనే డిజిటల్ మీడియా ప్రారంభిస్తున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తరువాత దశలో తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ ప్రారంభించే యోచలో ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
త్వరలోనే న్యూస్ ఛానల్...
ప్లాట్ఫామ్ పేరు త్వరలో ప్రకటించనున్నట్లు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా తెలియజేశారు. విజయసాయిరెడ్డి ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తానని చెప్పిన నేపథ్యంలో తొలుత డిజిటల్ మీడియాతో ఆయన వస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.