Chandrababu : అధికారులపై చంద్రబాబు సీరియస్

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష‍ నిర్వహించారు

Update: 2026-02-25 06:05 GMT

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష‍ నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వాకబు చేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో సీరియస్ కండిషన్లో ఉండి చికిత్స పొందుతున్న ఇద్దరి బాధితుల ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని.. మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామని అధికారులు చెప్పారు. వీరిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

స్పష్టమైన ఆదేశాలు...
ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించిన అధికారులు, పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని.. ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. రాజమండ్రి పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు చెప్పారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్ కు పంపామని చెప్పిన అధికారులు శాఖపరంగా దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారుల వెల్లడించారు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సీఎం ఆదేశించారు.ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.


Tags:    

Similar News