లక్ష్య సేన్ కు షాకిచ్చిన ప్రణోయ్

భారత్ కు చెందిన హెచ్.ఎస్.ప్రణోయ్ కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ను ఓడించాడు.

Update: 2022-08-25 10:56 GMT

భారత్ కు చెందిన హెచ్.ఎస్.ప్రణోయ్ కామన్ వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ను ఓడించాడు. ఇద్దరు భారతీయుల మధ్య సాగిన పోరు ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఫస్ట్ గేమ్ లో లక్ష్య సేన్ బాగా ఆడగా.. ఆ తర్వాత ప్రణోయ్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. దీంతో ప్రణోయ్ లక్ష్య సేన్‌ని ఓడించి సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. లక్ష్య సేన్, ప్రణోయ్ మధ్య ఒక గంటా 15 నిమిషాల పాటు సాగింది. ఈ పోరులో 17-21, 21-16, 21-17 తేడాతో ప్రణోయ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరు భారతీయులు తలపడడం నాలుగో సారి. హెడ్-టు-హెడ్ రికార్డు 2-2తో సమం అయింది. ప్రణోయ్ క్వార్టర్స్‌లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్‌తో తలపడనున్నాడు.

భారత పురుషుల డబుల్స్ జంటలు ధృవ్ కపిల- MR అర్జున్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించారు. చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను 21-12, 21-10 తేడాతో ఓడించింది. సాత్విక్ ,చిరాగ్ జంట గ్వాటెమాలన్ జంటను ఓడించి ప్రీ-క్వార్టర్‌ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జపాన్‌ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్ , చిరాగ్ జోడీ తలపడనుంది. భారత షట్లర్లు ధ్రువ్‌ కపిల- ఎం.ఆర్‌ అర్జున్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్‌ఫైనల్లో హీ యోంగ్‌ కాయ్‌ టెరీ–లో కీన్‌ హీన్‌ జంటను ఓడించి క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.


Similar News