టోర్నీ నుండి సైనా నెహ్వాల్ అవుట్

ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్

Update: 2022-08-25 11:36 GMT

ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్ చేతిలో ఓడిపోయి ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుండి నిష్క్రమించింది. 32 ఏళ్ల ఆమె 17-21, 21-16, 13-21తో థాయ్ ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైంది. టోక్యో వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన షట్లర్‌ బుసానన్‌ ఒంగ్బామ్రంగ్‌ఫాన్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నాలుగు నిమిషాల పాటు సాగింది ఈ మ్యాచ్. బుసానన్‌ ఆది నుంచే ఆధిపత్యం కనబరిచింది. మొదటి గేమ్‌ను సైనా 17-21తో కోల్పోయింది. రెండో గేమ్‌లో పుంజుకున్న సైనా 21-16తో ప్రత్యర్థిపై పై చేయి సాధించింది. ఈ క్రమంలో మూడో గేమ్‌లో తిరిగి ఆధిక్యంలోకి వచ్చిన బుసానన్‌ 21-13తో సైనాను ఓడించింది. తద్వారా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అంతకుముందు మ్యాచ్‌లో సైనా.. హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చెయుంగ్ న్గన్ యిను 21-19, 21-9తో ఓడించి ప్రిక్వార్టర్స్‌ కు చేరుకుంది. సైనా మునుపటి ఫామ్ ప్రదర్శిస్తుందని భావించగా.. బుసానన్ ముందు తేలిపోయింది.

ఇక ఇతర మ్యాచ్ లలో సింగపూర్‌కు చెందిన టెర్రీ హీ- లోహ్ కీన్ హీన్‌లపై 18-21, 21-15, 21-16తో గెలుపొందడానికి అన్‌సీడెడ్ ద్వయం అర్జున్- కపిల 58 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెండవ రౌండ్ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఎనిమిదో సీడ్, గత ఎడిషన్‌లో కాంస్య పతక విజేతలైన కిమ్ ఆస్ట్రప్- అండర్స్ స్కారప్ రాస్ముస్సేన్‌లను 21-17, 21-16తో ఓడించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News