హీరో మహేష్ కు మరోసారి సమన్లు

Update: 2017-06-27 13:51 GMT

శ్రీమంతుడి సినిమాను తన నవలను కాపీ కొట్టారని ఒక రచయిత పెట్టిన కేసులో హీరో మహేష్ బాబుకు, నిర్మాత ఎర్నేని నవీన్ కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ రోజు నాంపల్లి కోర్టులో ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు కోర్టు హాజరు నుండి మినహాయింపు కోరుతూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేసింది. అలాగే సినీ దర్శకుడు కొరటాల శివపైన కూడా కోర్టు సీరియస్ అయింది. శివ కూడా హైకోర్టు నుంచి మినహాయింపు కోరడంతో గతంలో సమన్లు జారీ చేసినా ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈ కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

Similar News