సోషల్ మీడియాలో జగన్ వీడియో వైరల్ అయిందే

Update: 2017-07-04 11:04 GMT

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు జగన్ పాదాభివందనం చేశారు. తనకు మద్దతిచ్చే పార్టీలతో తెలంగాణకు వచ్చిన రామ్ నాథ్ కోవింద్ పార్క్ హయత్ హోటల్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ అధినేత జగన్ పాదాభివందనం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా రామ్ నాథ్ కాళ్లకు నమస్కరించడం విశేషం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాబోయే రాష్ట్రపతిని మంచి చేసుకోవడానికే జగన్, విజయసాయి రెడ్డిలు రామ్ నాథ్ పాదాలకు నమస్కరించారని నెటిజెన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. జగన్ పాదాభివందనం చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా పక్కనే ఉన్నారు. మొత్తం మీద జగన్, విజయసాయిరెడ్డిలు పాదాభివందనం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Similar News