హైకోర్టు ఉత్తర్వులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రోజా సస్పెన్షన్ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. టీడీపీ తనను రాజకీయంగా అణచివేయాలని చూస్తోందన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు టీడీపీ నేతలు తూట్లు పొడుస్తున్నారని ఆమె అన్నారు.