పోలవరంః పోలవరం ముంపు మండలాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని చింతూరు, కుక్కునూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పోలవరం ముంపు మండలాలు విలీనం తర్వాత మొదటి సారిగా సీఎం పర్యటించనున్నారు. దీంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు చింతూరు వద్ద అన్ని మార్గాలను ఆధీనంలోకి తీసుకున్నారు.