వారిద్దరి మధ్య భగ్గుమన్న ఫ్యాక్షన్ కక్షలు !

Update: 2016-03-29 14:45 GMT

కర్పూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అప్పుడే విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ విభేదాలకు ఆజ్యం పోశాయి. నంద్యాలకు చెందిన టీడీపీ నేత తులసిరెడ్డిపై సోమవారం రాత్రి ప్రత్యర్థులు దాడి చేశారు. కంట్లో కారం చల్లి కత్తులతో తులసిరెడ్డిని తీవ్రంగా గాయపరిచారు. ఆయన్ను ప్రస్తుతం హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఇటీవల పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి వర్గీయుల పనేనని టీడీపీ జిల్లా నేత శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. భూమా పార్టీలో చేరిన నాటి నుంచే జిల్లాలో సమస్యలు మొదలయ్యాయన్నారు. భూమా అనుమతితోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. దీనిపై ఆయన మంగళవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేశారు. అయితే శిల్పా ఆరోపణలను భూమా నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడితో తనకు గానీ, తన అనుచరులకు గానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. దీనిపై జిల్లా ఎస్పీ స్వయంగా విచారణ జరపాలని ఆయన కోరారు.

Similar News