లోకేష్ అంటే బాబుకు భయమా?

Update: 2017-01-04 13:33 GMT

ఉత్తర ప్రదేశ్ లో జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బీపీ రోజురోజుకూ పెరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అక్కడ అఖిలేష్ లాగానే ఇక్కడ లోకేష్ తన పదవికి ఎసరు పెడతాడని భావించి లోకేష్ కు మంత్రి పదవిని చంద్రబాబు ఇవ్వడం లేదని రోజా అన్నారు. తిరుపతిలో ఈరోజు మాట్లాడిన రోజా చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్ధాలుగా సాగుతుందని విమర్శించారు. క్యాలెండర్లు మారుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మారడం లేదని రోజా ఎద్దేవా చేశారు.

రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. కుప్పానికి నీళ్లు ఇవ్వలేని చంద్రబాబు పులివెందులకు నీళ్లు ఇస్తామంటే ఎలా నమ్ముతామని రోజా ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదన్న రోజా....అందుకే ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. లీడర్లు వెళ్లినా క్యాడర్ తమ పార్టీ వెంటే ఉందని ఆమె చెప్పారు.

Similar News