లాడెన్ ఫొటో పెట్టుకుని ఉద్యమిస్తారా? : ఎంపీ హరిబాబు

Update: 2017-01-28 09:30 GMT

రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి కళ్లు పెట్టుకుని చూడాలని హోదా కోసం ఆందోళన చేస్తున్న నాయకులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు సూచించారు. నోట్ల రద్దుతో నష్టమేమీ లేదని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ తప్పని సీఐఐ భాగస్వామ్య సదస్సు నిరూపిస్తోందని ., హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేం చేయాలో కేంద్రం అన్నీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ రూపంలో చేస్తోందని., నష్టం జరుగుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ప్రత్యేక హోదాకు దక్షిణాదికి, ఉత్తరాదికి సంబంధం లేదు- జాతీయ భావాన్ని పెంపొందించాలని మాట్లాడే వారు ఈ రకంగా వ్యాఖ్యానించడం సరి కాద న్నారు. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమం చేయాలని కొందరు పిలుపునిస్తున్నారు, అదే సమయంలో న తమిళనాడులో ఉగ్రవాది బిన్ లాడెన్ ఫొటో పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో ఏమైనా చేస్తామని ఎవరైనా పిలుపునిస్తే ఖండిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు.

Similar News