రెండు రాష్ట్రాలలో శాసనసభ స్థానాల పెంపు!

Update: 2016-03-29 14:23 GMT

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభా స్థానాల పెంపుపై చర్చించనున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శితో ఆయన సమావేశమవుతున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకున్న తరువాత ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య శాసనసభ స్థానాల సంఖ్య పెంపు విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఆయన అన్నారు.

Similar News