రాజమహేంద్రిలో సీఎం సుడిగాలి పర్యటన

Update: 2017-09-08 01:27 GMT

రాజమహేంద్రి లో అర్బన్ జిల్లా కార్యాలయం, సిఐడి కార్యాలయం, కార్పొరేషన్ నూతన భవనాలు ప్రారంభించిన చంద్రబాబు గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు . అత్యాధునిక రీతిలో నిర్మించిన ఈ భవనాలు మోడల్ గా ఉన్నాయని సీఎం ప్రశంసించారు . అనంతరం పుష్కరఘాట్ లో గోదావరి హారతి కార్యక్రమాన్ని తిలకించి పూజలు చేశారు . జలసిరి కార్యక్రమంలో భాగంగా సీఎం ఇందులో పాల్గొని ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ బయల్దేరారు . ముఖ్యమంత్రికి ఎంపీ మురళీమోహన్ అర్బన్ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ , రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి , రాజానగరం ఎమ్యెల్యే పెందుర్తి వెంకటేష్ లు పలు సమస్యలపై విన్నపాలను సీఎం కి అందజేశారు .

Similar News