రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆమె ఎప్పుడో వచ్చేవారు : కేసీఆర్

Update: 2017-01-16 06:04 GMT

గ్రామీణులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో స్వర్ణభారతి ట్రస్ట్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రశంసించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూతురు దీప సారధ్యంలో నడుస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ తెలంగాణ చాప్టర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉండబట్టే దీపా వెంకట్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారని, ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవారిని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ సీబీఎస్ఈ సిలబస్ తో ఈ ప్రాంగణంలో అక్షర విద్యాలయాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా పేదరోగులకు సేవలందించేందుకు సూపర్ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారేకర్, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. దీప సమాజానికి చేస్తున్న సేవలను వారు కొనియడారు.

Similar News