యువతిని ...పదహారు ముక్కలుగా నరికి....

Update: 2018-01-31 02:08 GMT

అది హైటెక్ సిటీ ప్రాంతం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లులకు స్వర్గ ధామం . గచ్చిబౌలి. మాదాపూర్, కొండాపూర్ ఏరియాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ తో నిండిపొయింది. దాదాపుగా పది లక్షల మందికి పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ ఏరియాలో నివాసం వుంటున్నారు. ఇక్కడి వారంతా కూడా కాలంతో ప్రయాణం చేస్తుంటారు. తమ పక్క వాళ్లు ఏం చేస్తుంటారో చూసే టైమ్ వీరికి వుండదు. అలాంటి ప్రాంతంలో ఉదయం పది గంటల ప్రాంతంలో ఇద్దరు కూలీలు చూసిన గోనెసంచి తీవ్ర కలకలం రేపింది.

గర్భవతి అని చూడకుండా....

కొండాపూర్ సమీపంలోని బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో రండు గోనె సంచులను ఇద్దరు కూలీలు చూశారు. వీటి నుంచి దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి గోనె సంచులను తెరచిచూడగా అందులో యువతి మృతదేహం ఉంది. ముక్కలు...ముక్కలుగా నరికి గోనె సంచిలో పడేశారు. అయితే ఈ యువతి ఎవరన్నది అంతుబట్టలేదు. మొత్తం యువతి దేహాన్ని 16 ముక్కలుగా నరికారు. ఫోరెన్సిక్ వైద్యులు శరీరభాగాలను తీసుకెళ్లారు. పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులు భద్ర పర్చారు. అయితే యువతిని చంపడానికి ముందు చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్ట్ మార్టంలో తేలింది. అయితే ఆ యువతి ఎనిమిది నెలల గర్భవతి అని కూడా తేలింది. యువతి నార్త్ ఇండియాకు చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ యువతి హత్య హైదరాబాద్ లో సంచలనం రేపింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు పది బృందాలను ఏర్పాటు చేశారు.

Similar News