యువకుడు చనిపోయాడని...ఆ యువతిని కూడా...

Update: 2017-03-23 03:37 GMT

సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.ప్రేమికుడి చావుకి ప్రియురాలే కారణం అంటూ ....యువతి ఒంటి పై కిరోసిన్ పోసి నిప్పటించే ప్రయత్నం చేసారు అతడి బంధువులు.

మెట్టుగూడ ఆలు గడ్డ బావి కి చెందిన ప్రియాంక , ప్రశాంత్ ప్రేమించు కున్నారు. అయితే ఇంట్లో ఈ విషయం తెలియడం తో ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు పెద్దలు. అనంతరం ఉప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం లో ప్రశాంత్ చనిపోయాడు. ప్రశాంత్ మృతి ఫై క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన అతని స్నేహితులు , బంధువులు..ర్యాలీ ని. అమ్మాయి ప్రియాంక ఇంటి వైపు మళ్లించి .. వారి పై దాడికి దిగారు. అంతటి తో ఆగకుండా అమ్మాయి ప్రియాంక ఒంటి పై కిరోసిన్ పోసి నెల రోజుల్లో చని పోక పోతే చంపేస్తా మని స్థానిక నేతలు , ప్రియాంక బంధువు లను బెదిరించారు..ప్రియాంక ను ఆమె తల్లి దండ్రులను చితకొట్టి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ప్రియాంక పిర్యాదు తో స్థానిక నేతలైన సునీత్ ,సాయి తో పాటు మరో పది మంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు.

Similar News