మాజీ సీఎంపై రాళ్ల వర్షం

Update: 2017-11-04 13:17 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కు చేదు అనుభవం ఎదురయింది. బీజేపీ కర్ణాటకలో బలపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలో నవ కర్ణాటక పరివర్తన యాత్ర మొన్న ప్రారభమైంది. ఈ యాత్ర కర్ణాటక మొత్తం తిరుగుతుంది. అయితే శనివారం యడ్యూరప్ప పరివర్తన యాత్రలో ఉండగా కొందరు బీజేపీ శ్రేణులే ఆయన వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. కొంతకాలం క్రితం చౌదరి నగేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నగేష్ అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాళ్ల దాడి నుంచి యడ్యూరప్ప తప్పించుకున్నారు.

Similar News