పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా సవాలు విసిరారు. స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డ తృణమూల్ కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి తొలగించాలని అమిత్షా కోల్కతాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సవాలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ చేసి పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు లంచం తీసుకుంటున్నట్లుగా వీడియో విడుదలచేసింది. దీంతో పార్టీపై, మమతపై విమర్శలు వెల్లువెత్తాయి.శారదా కుంభకోణంపైనా అమిత్షా విమర్శలు చేశారు. ఈ విషయంలో భాజపా, తృణమూల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అవినీతి వ్యతిరేకంగా పోరాడతానని హామీలు ఇచ్చిన మమత బెనర్జీ స్టింగ్ ఆపరేషన్లో దొరికిన నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.