బీజేపీపై రేవంత్ షాకింగ్ కామెంట్స్

Update: 2017-06-29 12:38 GMT

బీజేపీపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వొద్దని సూచించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రంపై పెను భారం పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి మూడు వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. చివరిగా రేపు జరగనున్న జీఎస్టీ సమావేశంలోనైనా రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తి రాష్ట్రప్రయోజనాలను కాపాడాలన్నారు. జీఎస్టీ నష్టాన్ని కేంద్రం భరించేలా వత్తిడి చేయాలని అందుకు అవసరమైతే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వకూడదని కూడా సూచించారు. అంతే కాకుండా నోట్ల రద్దు సమయంలో కూడా కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్ధించారన్నారు. రేవంత్ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Similar News