టీడీపీలో మంత్రి ఆది ప్రకంపనలు....!

Update: 2018-02-15 13:50 GMT

మంత్రి ఆదినారాయణరెడ్డి ఆవేశపడ్డారా? తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి ముందుగానే మీడియాకు చెప్పారా? అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మార్చి 5వ తేదీనే తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి కేంద్రప్రభుత్వం నుంచి బయటకు వస్తామని చెప్పారు. ఎంపీలది కూడా అదే బాట అని చెప్పారు. అయితే ఇది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కాదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. జగన్ సవాల్ ను చూసి ఆదినారాయణరెడ్డి ఆగ్రహంతో ఈ ప్రకటన చేసి ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మీడియా ముందు ప్రకటన చేసే ముందు సంయమనం పాటించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. జగన్ సవాల్ కు ఆవేశపడాల్సిన అవసరం ఏముందని కొందరు ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. తమ అధినేతసరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని, ఆదినారాయణరెడ్డి తొందరపడ్డారని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నుంచి గెలిచి పార్టీలోకి వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటనను ఆయన వ్యక్తిగతంగానే చూడాలంటున్నారు.

Similar News