కర్ణాటక ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు...?

Update: 2018-03-31 13:08 GMT

కర్ణాటక ఎన్నికల్లో డబ్బులు పంచడానికి తీసుకొని పోతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న రైల్లో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల వ‌ద రెండు బ్యాగ్ ల‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. తనిఖీ చేయడంతో పదిలక్షల విలువైన రెండు వేలనోట్ల రూపాయలు బయటపడ్డాయి. అయితే ఇవి నకిలీవిగా గుర్తించారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో వస్తున్న ఈ ఇద్దరిని విశాఖలో డీఆర్ఐ అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. అయితే వీటిని కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. అయితే వీరిద్దరిపై ఇప్పటికే బంగ్లాదేశ్ లో కిడ్నాప్ కేసు నమోదయి ఉన్నట్లు గుర్తించారు. ఫేక్ కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు వీరు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News