కడపలో టీడీపీకీ పెద్ద దెబ్బ.... మూకుమ్మడి రాజీనామాలు....!

Update: 2018-02-03 14:12 GMT

కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేతలు. కడప కార్పొరేషన్ లోని పది మంది టీడీపీ కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడికి సమర్పించారు.కలెక్టర్ తీరుకు నిరసనగా రాజీనామాలు సమర్పించినట్లు వారు తెలిపారు. అయితే కడపలో ఇళ్ల స్థలాల వివాదంలో కలెక్టర్ ఇటీవల ఉన్నతాధికారులతో విచారణ జరిపారు. ఆ విచారణలో కార్పొరేటర్ల హస్తం ఉందని, పక్కా గృహాల మంజూరులో అవినీతి జరిగిందని విచారణలో తేలింది. అయితే విచారణ నివేదికను తమకు చూపించాలని కలెక్టర్ ను టీడీపీ కార్పొరేటర్లు కలిశారు. అయితే కలెక్టర్ బాబూరావు నాయుడు అందుకు అంగీకరించలేదు. దీంతో కలెక్టర్ వైఖరి తమ పట్ల సరిగా లేదని చెప్పి పది మంది టీడీపీ కార్పొరేటర్లు రాజీనామా చేశారు. అయితే పదిమంది కార్పొరేటర్ల మూకుమ్మడి రాజీనామాతో టీడీపీలో కలకలం రేగింది. పార్టీ నేతలు రంగంలోకి దిగి వారిని బుజ్జగించే చర్యలు ప్రారంభించారు. కడప కార్పొరేషన్ లో ప్రస్తుతం టీడీపీకి పది మంది కార్పొరేటర్లు ఉండగా, వైసీపీకి 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

Similar News