వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సభకు రాకుండా ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. అసెంబ్లీ బిజినెస్ రూల్ 340(2) ప్రకారం సస్పెన్షన్ ఒక సమావేశానికే వర్తిస్తుందని పేర్కొన్న న్యాయమూర్తి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.