ఈ ఎస్ఐ వివాహేతర సంబంధం ఎంతపని చేసింది?

Update: 2018-01-31 10:37 GMT

హైదరాబాద్ లో మరో ఖాకి భాగోతం వెలుగు చూసింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడో ఎస్ఐ. జవహర్ నగర్ ఎస్ నరసింహులు తన భార్యను ట్రాప్ చేశాడని ఓ భర్త ఫిర్యాదు చేశాడు. జ్యోత్స్న, సతీష్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో పోలీసు స్టేషన్ ఆశ్రయించింది జ్యోత్స్న. అక్కడ ఎస్ ఐగా పనిచేస్తున్న నరసింహులు ఆమె సెల్ ఫోన్ నెంబరు తీసుకుని తాను సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఫోన్లో జ్యోత్స్నతో మాటలు కలుపుతూ ట్రాప్ లోకి లాగాడు. ఎస్ఐ మాయమాటలు విన్న జ్యోత్స్న భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడింది. ఎస్ఐ నరసింహ క్రెడిట్ కార్డుతో జోరుగా షాపింగ్ చేయడంతో అనుమానం వచ్చిన భర్త కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో భర్త సతీస్ మల్కాజ్ గిరి డీసీపీకి ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే చర్య తీసుకున్నారు. ఆడియో టేపులు, మెసెజ్ లను చూసిన పోలీసు ఉన్నతాధికారులను వెంటనే ఎస్ ఐ నరసింహను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఎస్ఐ తనను విడాకులివ్వమని అనేకసార్లు బెదిరించాడని సతీష్ చెబుతున్నాడు.

Similar News