బౌలింగ్కు ఆసీస్ చిత్తైంది. ధాటిగా లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్పై క్రమంగా ఒత్తిడి పెంచి ప్రపంచకప్ టోర్నీలో రెండో విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్తిల్ (39), కేన్ విలియమ్సన్ (24), మన్రో (23), ఇలియట్ (2) రాణించారు. రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఆసీస్ తొలి ఐదు ఓవర్లు ధాటిగా ఆడినా.. కీలక సమయాల్లో న్యూజిలాండ్ బౌలర్లు వికెట్లు తీయడంతో ఒత్తిడికి గురై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మెక్లగాన్ 3, సాంట్నర్ 2, అండర్సన్ 2, ఇష్ సోధి 1 వికెట్ తీశారు.