‘అవసరమైతే రద్దు చేస్తాం’

Update: 2017-12-14 12:56 GMT

అమరావతికి సమీపంలో జనసేన పార్టీ కార్యాలయంపై వస్తున్న వివాదాలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. తాము రైతు దగ్గర మూడున్నరేళ్లకు స్థలాన్ని లీజుకు తీసుకున్నామన్నారు. జనసేన కార్యాలయం కోసం తీసుకున్న స్థలంపై వివాదం ఉంటే ఆ స్థలాన్ని తీసుకోబోమన్నారు. తాను ఇటీవల స్థలం వద్దకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదన్నారు. స్థలం వివాదాస్పదమైతే లీజును రద్దుచేసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. స్థలం లీజుకు తీసుకున్న విషయాన్ని పత్రికా ప్రకటన ఇచ్చామన్నారు. అయితే ఈ స్థల యజమాని యార్లగడ్డ సుబ్బారావు మాత్రం తన తండ్రి 1956లో ఒక ముస్లిం కుటుంబం నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని, ఇంతవరకూ ఆ స్థలం తమదేనని ఎవరూ రాలేదన్నారు.

Similar News