అధికారం కోసం బాబు ఏ పనైనా చేస్తాడు! -- జగన్

Update: 2016-03-31 16:24 GMT

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శ నాస్త్రాలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు వ్యక్తిత్వం, విశ్వాసనీయత లేదని, అధికారం కోసం ఏ గడ్డయినా తింటారని, సొంత మామ అయిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిత్వం ఆయనదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అబద్దాలు చెప్పారని, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం ఆయన విశ్వాసనీయతని, అందుచేత చంద్రబాబుకు వ్యక్తిత్వం, విశ్వాసనీయత ఆ రెండూ లేవని జగన్‌ అన్నారు.

చంద్రబాబు వద్ద ఉన్న అవినీతి సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రజల గొంతును వినిపించకుండా చేయడానికి చేస్తున్నారని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంవల్ల వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓట్లు వేయరని జగన్‌ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ తీరుపై జగన్‌ మండిపడ్డారు. రోజమ్మపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకుని శాసనసభకు వెళ్లినా పట్టించుకోలేదని జగన్‌ మండిపడ్డారు. ఆయన తీరు చాలా బాధాకరమని, ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడకుండా సభాపతి కాపాడారని ఆయన విమర్శించారు. డబ్బుల కోసం ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని జగన్‌ ఆరోపించారు.

Similar News