బ్రేకింగ్ : నాలుగు స్థానాలూ వైసీపీవే

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం లభించింది. వైసీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి [more]

Update: 2020-06-19 12:50 GMT

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం లభించింది. వైసీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీకి చెందిన నలుగురు అభ్యర్థుల్లో ఒకరు. ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేసింది. అలాగే వైసీపికి చెందిన పిిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని కూడా విజయం సాధించారు. ఏపీలోని నాలుగు స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు దక్కాయి.

Tags:    

Similar News