చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జాతీయ నేతలు పిలవకున్నా చంద్రబాబు [more]

Update: 2019-05-21 06:40 GMT

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జాతీయ నేతలు పిలవకున్నా చంద్రబాబు వాళ్ల వద్దకు వెళుతున్నారని, రాష్ట్రంలో గెలవని చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఏదో చేస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తాను చెప్పిందే జరగాలనేది చంద్రబాబు అత్యాశ అని, చేసిన తప్పులను పక్క వాళ్లపైకి నెట్టడంలో ఆయన దిట్ట అని అన్నారు. చంద్రబాబు తన హుందాతనాన్ని కోల్పోయారన్నారు. విపక్షాల సమావేశంలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టారని అన్నారు. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్లి ఏపీ పరువు తీస్తున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని సైతం చంద్రబాబు వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. కొన్ని గంటలల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాబోయే ఓటమిని ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News