తాడిపత్రి ఘర్షణల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. తాడిపత్రి మండలం వీరవరం గ్రామంలో రెండు పార్టీల [more]

Update: 2019-04-11 08:20 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. తాడిపత్రి మండలం వీరవరం గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త పుల్లారెడ్డి, టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి మృతి చెందారు. పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు.

Tags:    

Similar News